అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బైనోల గ్రామంలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం తెల్లా చిన్నలింగం (45) దుబాయి నుంచి వచ్చి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండెకరాల పొలం ఉండగా వాటిలో ఏడు సార్లు బోర్లు వేయించినా నీరు పడలేదు.
మరోవైపు ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసం అప్పులు చేశాడు. మొత్తం రూ.4 లక్షల అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.