మంత్రి ఈటల సమక్షంలో...

మంత్రి ఈటల సమక్షంలో... - Sakshi

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్‌ ఎదుట ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మండలంలోని పొత్తూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మంత్రి రాజేందర్‌ ఆదివారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని పోలీసులు అడ్డుకుని నచ‍్చజెప్పారు.



సాగునీరు అందక వరిపంట ఎండిపోయిందంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. ఎండిన పంటలను సర్వే చేయించి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top