మంత్రి ఈటల సమక్షంలో...
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటల రాజేందర్ ఎదుట ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మండలంలోని పొత్తూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మంత్రి రాజేందర్ ఆదివారం ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు.
సాగునీరు అందక వరిపంట ఎండిపోయిందంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. ఎండిన పంటలను సర్వే చేయించి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.