రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం
అచ్చంపేట రూరల్: కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి వద్ద బుధవారం జరి గి న ఘోరరోడ్డు ప్రమాదంలో అచ్చం పేటకు చెందిన మెడిసిన్ విద్యార్థి మ హేష్నాయక్(22) దుర్మరణం పాల య్యా డు. అచ్చంపేటకు చెందిన తు లసీరాం, రూప్లిభాయికి ముగ్గురు సం తానంలో ఇద్దరు కొడుకులు, కూతురు ఉ న్నారు. వీరిలో పెద్దకొడుకు నరేష్ ఇం జనీరింగ్ చదువుతుండగా, మహేష్నాయక్ కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మె డికల్ కాలేజీలో మెడిసిన్ ద్వితీయ సం వత్సరం చదువుతున్నాడు. బుధవా రం ఉదయం నలుగురు స్నేహితులు, మెడిసిన్ విద్యార్థులు నవీన్, రాహుల్తో కలిసి మహేష్నాయక్ కారులో హైదరాబాద్కు వెళ్లారు. తిరుగు ప్ర యాణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మహేష్నాయక్ మృత్యువాతపడ్డాడు.
అచ్చంపేటలో మిన్నంటిన రోదనలు
రోడ్డు ప్రమాదంలో మహేష్నాయక్ చనిపోయాడని కళాశాల సిబ్బంది చె ప్పడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రు లు తులసీరాం, రుప్లిభాయితో పాటు మరికొందరు బంధువులు కరీంనగర్కు వెళ్లారు. తులసీరాం టీఆర్ఎస్లో కీలకనాయకుడిగా ఉన్నారు. కొడుకు మృతితో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర శ్రేణులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చుతున్నారు.