నకిలీ మావోయిస్టులు అరెస్ట్
తాడ్వాయి: మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. జయశకంర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని కటాపూర్లో మావోయిస్టుల మంటూ చందాలు వసూలు చేస్తున్న ఊకె సమ్మయ్య, ఈసం కాంతారావు, ఉద్యమరి సంపత్, పాయం సత్యంలను తాడ్వాయి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ములుగు డీఎస్పీ దక్షిణమూర్తి విలేకరులకు సమావేశంలో వివరాలు తెలిపారు.