పట్టుబడిన నకిలీ నయీమ్ ముఠా
వెల్దండ (నాగర్కర్నూల్ జిల్లా): గ్యాంగ్స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు శేషన్న పేరుతో బెదిరింపులకు దిగుతున్న ఐదుగురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల్లో న ల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం గురుజాలకు చెందిన పుట్ట సతీశ్, మామిడిమిద్దెవాసి భూపతి జానయ్య, వాలాలకు చెందిన సున్కి యాదగిరి, నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెం దిన హలీం, భర్కత్పల్లి వాసి మహేశ్ ఉన్నారు. వివరాలను గురువారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో సీఐ గిరికుమార్ కల్కోటే వెల్లడించారు.
గ్యాంగ్స్టర్ నయీమ్ హత్య ఉదంత పరిణామాలకు ఆకర్షితుడై సులువుగా డబ్బులు సంపాదించాలని యోచించాడు. వెల్దండకు చెందిన వెల్డింగ్ వ్యాపారి మట్ట శ్రీనివాస్గౌడ్కు ఈ నెల 5న నయీమ్ ముఖ్య అనుచరుడు శేషన్న పేరుతో ఫోన్ చేసి రూ.ఐదు కోట్లు ఇవ్వాలని, లేకుంటే భార్యాపిల్లలను చంపుతామన్నారు. దీంతో శ్రీనివాస్గౌడ్తో సతీశ్ రూ.రెండు కోట్ల ఒప్పందం చేసుకున్నాడు.
మరోవైపు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీశ్ మేనమామ మామిడిమిద్దెకు చెందిన భూపతి జానయ్య, వెల్దండవాసి ఎం.డి.అలీం, శ్రీనివాస్గౌడ్ గుప్తనిధుల తవ్వకాల వేటలో భాగస్వాములు. వెల్దండ మండలం చెర్కూర్ భర్కత్పల్లి వార్డు సభ్యుడు మహేశ్ను డబ్బులు తీసుకురావాలని శ్రీనివాస్ గౌడ్ వద్దకు పంపించగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపడంతో ముఠా వివరాలు బయటపడ్డాయి.