పెళ్లిపీటలెక్కిన ఫేస్బుక్ ప్రేమ
ములుగు (వరంగల్) : ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి చెందిన ఇనుముల రామస్వామి, సుగుణ దంపతుల కుమారుడు కిరణ్కు 2013లో ఫేస్బుక్ ద్వారా ముంబైకి చెందిన సరస్వతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరువురి పెద్దలను ఒప్పించారు. ఈ మేరకు ములుగులోని చర్చిలో కిరణ్, సరస్వతి బుధవారం పెళ్లి చేసుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, జెడ్పీ ఫ్లోర్లీడర్ సకినాల శోభన్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
సంబంధిత వార్తలు