నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు


పాల్వంచ : నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. సీఐ రాంప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని జగ్గుతండా, శేఖరం బంజర గ్రామాల్లో నాటు సారా స్థావరాల్లో విస్త్రృతంగా పర్యటించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుగులోతు బిక్కులాల్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పున్నయ్య, సిబ్బంది లింగా, శ్రీనివాసరావు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top