మిర్యాలగూడలో ఎక్సైజ్ దాడులు


మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి వినియోగిస్తున్న బెల్లంపటికను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 టన్నుల బెల్లం పటికను పట్టణంలోని టాకా రోడ్డులో ఉన్న ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేపట్టారు. గోడౌన్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top