మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌ కుమారుడి మృతి

మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌ కుమారుడి మృతి - Sakshi


- కట్టంగూర్‌లో రోడ్డు ప్రమాదం

మరొకరు కూడా దుర్మరణం


కట్టంగూర్‌: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌ కుమారుడు, ప్రముఖ వైద్యుడు విజయ్‌కుమార్, ఆయన అత్త సావిత్రిబాయి మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆయిల్‌ ట్యాంకరును వీరి వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం హర్ష మెటర్నిటీ జనరల్‌ నర్సింగ్‌ హోమ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు విజయ్‌కుమార్‌(55), ఆయన భార్య, గైనకాలజిస్టు ఝాన్సీలక్ష్మి, అత్త సావిత్రిబాయి(75), శోభ  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగే ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.



కట్టంగూరు గ్రామ శివారులోని ముత్యాలమ్మగూడెం సమీపంలో ముందున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వెనుక నుంచి వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సావిత్రిబాయి అక్కడికక్కడే మృతి చెందగా.. విజయ్‌కుమార్‌ చికిత్స పొందుతూ మరణించారు. తీవ్ర గాయాలైన ఝాన్సీలక్ష్మి, శోభను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


 

















 


  కట్టంగూర్‌లో రోడ్డు ప్రమాదం


  మరొకరు కూడా దుర్మరణం


 


కట్టంగూర్‌: రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే ఓంకార్‌ కుమారుడు, ప్రముఖ వైద్యుడు విజయ్‌కుమార్, ఆయన అత్త సావిత్రిబాయి మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఆయిల్‌ ట్యాంకరును వీరి వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం హర్ష మెటర్నిటీ జనరల్‌ నర్సింగ్‌ హోమ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు విజయ్‌కుమార్‌(55), ఆయన భార్య, గైనకాలజిస్టు ఝాన్సీలక్ష్మి, అత్త సావిత్రిబాయి(75), శోభ  మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగే ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. కట్టంగూరు గ్రామ శివారులోని ముత్యాలమ్మగూడెం సమీపంలో ముందున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో వెనుక నుంచి వీరి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సావిత్రిబాయి అక్కడికక్కడే మృతి చెందగా.. విజయ్‌కుమార్‌ చికిత్స పొందుతూ మరణించారు. తీవ్ర గాయాలైన ఝాన్సీలక్ష్మి, శోభను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top