‘ఆ పార్టీకి పుట్టగతులుండవ్‌’

‘ఆ పార్టీకి పుట్టగతులుండవ్‌’ - Sakshi


నిజామాబాద్: గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కుట్రలు చేస్తోందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అలాంటి పార్టీకి పుట్టగతులు ఉండవని ఆయన విమర్శించారు. పోచంపాడు వద్ద సీఎం కేసీఆర్ సభ కోసం చేసిన ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి ఈటల విలేకరులతో మాట్లాడారు.



కోర్టులో కేసులు వేస్తూ కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీతో పాటు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరుపై ఈటల మండిపడ్డారు. కేంద్రం అంటే మీ జాగీరు కాదని,  మేము అడుక్కునే వాళ్లము కాదు.. మీరు వేసే వాళ్లు కాదని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top