కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం

కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్కి అధికారం - Sakshi


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కాంగ్రెస్ తప్పుల వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆయన శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. ఎన్నికల హామీలు విస్మరిస్తే సహించేది లేదని ఎర్రబెల్లి ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి అన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top