తాగునీటి కోసం నిరసన

తాగునీటి కోసం నిరసన - Sakshi


మునగాల: నల్లగొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామస్తులు తాగునీటి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు 50 మంది గ్రామస్తులు ఖాళీ బిందెలతో కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం తలపులు మూసివేసి, అధికారులు సమస్య పరిష్కరించేవరకు వెళ్లేది లేదని అక్కడే ఆందోళన చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు తమ సమస్యను పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top