సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
కరీంనగర్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బుధవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనటంతో గోదావరిఖని డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. అన్ని పార్టీల అనుబంధ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికులు కూడా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.