మోసం చేసిన ఉద్యోగిని అరెస్ట్
కరీంనగర్ క్రైం: కరీంనగర్ నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న పోతర్ల సునీత(37) పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఉద్యోగాల ఇప్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్రావుల లెటర్ ప్యాడ్లు, ఫోర్జరీ సంతకాలతో పలువురిని మోసం చేసిన వైనంపై సాక్షి’ మెయిన్లో మంత్రుల పేరుతో టోకరా’ శీర్షికతో శనివారం ప్రచురితమైన కథనంపై పోలీసులు స్పందించారు.
ప్రధాన నిందితురాలు సునీతతో పాటు ఆమె కుమారుడు పోతర్ల హరీష్ అలియాస్ సన్నీ(22), సునీత తమ్ముడు సత్యపాల్లపై కేసు నమోదు చేశామని కరీంనగర్ త్రీటౌన్ సీఐ సదానందం తెలిపారు. శనివారం ప్రధాన నిందితురాలు సునీతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.