వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
ఉప్పల్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన నూతలకంటి సంజీవ(62) సెక్యూరిటి గార్డుగా పని చేస్తున్నాడు. సురేష్(45) ద్విచక్ర వాహనంపై సంజీవ రామంతాపూర్ నుంచి ఉప్పల్కు వెళుతుండగా ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం-1 వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహానం ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజీవ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేష్కు తీవ్ర గాయాలు కాగా ఉప్పల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.