భూకంప వదంతులతో రోడ్లపైనే జాగారం


కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భూకంప వదంతులు ....ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేశాయి. భూకంపం వస్తోందని పుకార్లతో జనాలంతా నిద్ర పోకుండా రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాల్లో భూకంప పుకార్లు షికారు చేయటంతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.


 


దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top