దుష్ర్పచారం నమ్మొద్దు
జమ్మికుంట : ‘ట్రాక్టర్ ఉన్నా, కారున్నా, టీవీ ఉన్నా, బైక్ ఉన్నా పింఛన్ రాదంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దు. అభాగ్యుల కోసమే ఆసరా పథకం ఉంది. అర్హులందరికీ పింఛన్ వస్తుంది’ అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం వీణవంక, జమ్మికుంట మండలాలకు చెందిన లబ్ధిదారులకు నగరపంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి అధ్యక్షతన ఆసరా పింఛన్ల పంపిణీ జరిగింది.
దీనికి ఈటెల ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. గత పాలకుల హయూంలో పింఛన్ రూ.200 నుంచి రూ.500 వరకు ఇస్తే తాము రూ.1000 నుంచి రూ.1500 చెల్లిస్తున్నామన్నారు. పేదవారు పింఛన్ల కోసం ఎవరినీ అడగాల్సిన పనిలేదన్నారు. నీటి సమస్య పరిష్కారానికి బడ్జెట్లో జమ్మికుంట మండలానికి రూ. 40 కోట్లు, హుజూరాబాద్కు రూ.50 కోట్లు, వీణవంక మండలానికి రూ.12 కోట్లు, ఇల్లందకుంటలో రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 32 కోట్లు మంజూరు చేశామన్నారు.
జమ్మికుంటకు మరో రూ.20 కోట్లు ఇస్తామని చెప్పారు. జిల్లాలో బీటీ రోడ్ల మరమ్మతుకు రూ. 250 కోట్లు మంజూరు చేశామన్నారు. జనవరి, ఫిబ్రవరి నుంచి విద్యార్థుల వసతిగృహాలకు సన్నం బియ్యం సరఫరా చేస్తామని, ప్రతీ వ్యక్తికి ప్రస్తుతం అందించే రేషన్ బియ్యూన్ని ఆరు కిలోల నుంచి పది కిలోలకు పెంచుతామని మంత్రి అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి ఊరూరా పింఛన్ లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ వీరబ్రహ్మయ్య తెలిపారు.