నిర్లక్ష్యంగా నడిపితే డ్రైవింగ్‌ లెసైన్స్ రద్దు


సాక్షి, హైదరాబాద్: బడిపిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు కానుంది. నిబంధనలు పాటించ కున్నా, నిర్లక్ష్యంగా నడుపుతున్నా అధికారులు అప్పటికప్పుడే డ్రైవర్ లెసైన్స్‌పై ‘క్యాన్సిల్డ్’ అని మార్కు చేయనున్నారు. మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గురువారం సాయంత్రం తనను కలిసిన రవాణా శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top