రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
తిరుమలగిరి: నల్గొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో జనగాం - సూర్యాపేట ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ రహదారిపై వెళ్తుండగా అదుపు తప్పడంతో పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో లారీ వేగం ఎక్కువగా ఉండటంతో స్టీరింగ్, డ్రైవర్ ఛాతీని తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.