తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ


 నంగునూరు: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం పాలమాకులలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుండెళ్లి చంద్రయ్య (50) నిరుపేద కావడంతో బతుకుదెరువు కోసం కరీంనగర్‌కు వెళ్లి హమాలి పనులు చేసేవాడు. అనారోగ్యానికి గురైన చంద్రయ్య రెండు నెలల కిందట స్వగ్రామానికి వచ్చి భార్య కిష్టవ్వతో కలసి కూలి పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో చంద్రయ్య సోమవారం రాత్రి మృతి చెందాడు. అతనికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు కృష్ణవేణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. కాగా నిరుపేదలైన వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top