మద్యం సీసాలపై 'డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్'
హైదరాబాద్: మద్యం బాటిళ్లపై ప్రస్తుతం ఉన్న 'మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం' అని ముద్రించి ఉన్న లేబుళ్ల మాదిరిగానే 'డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్' అని ఉన్న లేబుళ్లను అంటించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆర్.చంద్రవదన్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
21 ఏళ్ల లోపు వయసు కలిగిన వారికి మద్యం విక్రయించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మద్యం ప్రమాదకర స్థాయిని మించిందా అని తెలుసుకునేందుకు మిషన్ స్మార్ట్ రైడ్ అనే ఎన్జీవోతో కలిసి ప్రత్యేక యాప్ రెడీ చేస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై బార్, పబ్ సిబ్బందితో పాటు డిపోలలో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మందుబాబులతో తలెత్తే సమస్యలపై టోల్-ఫ్రీ నంబర్ 18004252523 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.