అంత ఖరీదైన బస్సు ఎందుకు?

అంత ఖరీదైన బస్సు ఎందుకు? - Sakshi


న్యూఢిల్లీ:  తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రూ.5 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.  ఆ పార్టీ  సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్...  కేసీఆర్  ప్రత్యేక బస్సుపై కస్సుబుస్సులాడుతున్నారు.   ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు  డబ్బులు లేవు కానీ, ఖరీదైన బస్సు కోసం మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటూ ట్విట్టర్లో కేసీఆర్పై విరుచుకుపడ్డారు.   కేసీఆర్ తీరు నిజాం నవాబును మరిపిస్తోందని  డిగ్గీరాజా  ఆగ్రహం వ్యక్తం చేశారు.  



కేసీఆర్ ఏం వెలగబెట్టారని ఆయనకు ముప్పు పొంచి ఉంది. ఆయన మీద ఎవరు దాడి చేస్తారు.. అసలెందుకీ అత్యాధునిక బస్సు? కోట్లు ఖర్చు పెట్టి బస్సును కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని  టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు శుక్రవారం కేసీఆర్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top