మృత దేహంతో బంధువుల రాస్తారోకో

మృత దేహంతో బంధువుల రాస్తారోకో - Sakshi


- వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోరుుందని ఆరోపణ

- చర్యలు తీసుకోవాలని డిమాండ్

మెట్‌పల్లి :
పట్టణంలోని మిషన్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతదేహంతో గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు మృతురాలి బంధువుల కథనం ప్రకారం. కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన గర్భిణి రాధ  అలియాస్ లాస్య(22)కు శనివారం పు రిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు స్థానిక మిషన్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు ఆడ శిశువు జన్మనిచ్చింది. శిశువుకు ఆరోగ్య సమస్యలు రావడం తో  జగిత్యాలలోని ఓ ఆస్పత్రికి తరలించారు.



రాధ బు ధవారం రాత్రి అస్వస్థతకు గురైంది. పలుమార్లు చికి త్స అందించిన మిషన్ ఆస్పత్రి సిబ్బంది గురువారం పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కరీంనగర్‌లోని ప్రై వేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే కరీంనగర్ తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తీసుకుపొమ్మనడంతో అక్కడికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి రాధ కొన్ని గంటల క్రితమే మృతిచెందిందని తెలిపారు. దీంతో వారు మెట్‌పల్లిలో ని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  మృతురాలి బంధువులు వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

చికిత్సలో లోపం లేదు : కిరణ్, మిషన్ ఆస్పత్రి నిర్వాహకులు

రాధకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదు. ఉదయం రెండుసార్లు తలనొప్పి, వాంతులు రావడంతో ఎండీతో పరీక్షలు చేయించాం. ఆయన సూచనతో కరీంనగర్‌కు తరలించాలని చెప్పాం. ఇక్కడే ఆమె మృతి చెందిందనే ఆరోపణల్లో నిజం లేదు. పోస్టుమార్టం నివేదికలో వాస్తవాలు తెలుస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top