9 గంటలకే అసెంబ్లీకి చేరుకోండి: కేసీఆర్

9 గంటలకే అసెంబ్లీకి చేరుకోండి: కేసీఆర్ - Sakshi


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో డీఎల్ఎఫ్ భూ కేటాయింపుల అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో భూ కేటాయింపులపై ఎదురుదాడికి  అధికారపక్షం కూడా సిద్ధమవుతోంది.


 


ఉదయం తొమ్మిది గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ)  సమావేశం. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై చర్చించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top