మహిళలకు ప్రాధాన్యమేది?: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట తొలి మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటు లేకపోవడం విచారకరమని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే. అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉందనుకుంటుంటే, కనీసం మంత్రివర్గంలో ఒక్కరికైనా అవకాశం ఇవ్వలేక పోయారని అన్నారు.
2009లో వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రి వర్గంలో ఆరుగురు మహిళలకు అవకాశం ఇస్తే, అందులో అయిదుగురు తెలంగాణకు చెందిన వారేనని గుర్తు చేశారు. మంత్రివర్గంలో మహబూబ్నగర్కు చెందిన ఇద్దరికి చోటు దక్కడం హర్షణీయమని, ఆ ఇద్దరు మంత్రులు పాలమూరు గోసను పట్టించుకోవాలని ఆమె కోరారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు.