డీసీఎం-బైక్ ఢీ.. రైస్ మిల్ యజమాని మృతి
వేగంగా వెళ్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుడిపాటి లక్ష్మయ్య(55) బైక్ పై తన రైస్మిల్కు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.