రుణమాఫీ విధివిధానాలపై చర్చ

నాగిరెడ్డి


హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ విధివిధానాలపై ఉన్నత స్థాయి అధికారులు చర్చిస్తున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డి నేతృత్వంలో సచివాలయంలో అధికారుల బృందం సమావేశమైంది. రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం రుణ మాఫీకి ఏ నిబంధనలు పాటించాలి అనే విషయమై వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. వ్యవసాయ రుణాలమాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన 11 మంది సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. రుణమాఫీకి  విధివిధానాలను ఈ కమిటీ రూపొందిస్తుంది.



రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇటు కె.చంద్రశేఖర రావు, అటు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఏపిలో  ఆచితూచి అడుగులు వేస్తుంటే, తెలంగాణలో మాత్రం త్వరితగతిన మాఫీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపిలో రీ షెడ్యూల్ అంటుంటే, తెలంగాణలో మాత్రం రుణాలు పూర్తిగా ఎత్తివేసే దిశగా విధివిధానాలు రూపొందిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top