డయల్ ‘100’కు 2,171 ఫోన్ కాల్స్
నిజామాబాద్ క్రైం : జిల్లాలో గత నెలలో నిర్వహించిన పీపుల్స్ ఫ్రెండ్లీ మెజర్స్ కార్యక్రమంలో భాగంగా డయల్ ‘100’కు 2,171 ఫోన్కాల్స్ వచ్చాయని ఎస్పీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు డయల్ ‘100’ కార్యక్రమానికి వచ్చిన ఫోన్కాల్స్లో వ్యక్తులపై దాడులకు సంబంధించిన కేసులు 119, యాక్సిడెంట్లు 630, ప్రాపర్టీ అఫెన్సెస్ 27 కేసులు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు 244, ఇతర కేసులు 1,017, తప్పుడు కేసులు(ఫాల్స్ కేసులు) 134 నమోదైనట్లు ఎస్పీ చెప్పారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్లో 188 ఫిర్యాదులు నమోదు కాగా, 112 ఫిర్యాదులు పరిష్కరించామని, 22 కేసులు 498(ఏ) కింద నమోదు చేసి మిగతావి వాయిదా వేశామన్నారు.
జిల్లాలోని 45 పోలీస్స్టేషన్లలో విచారించదగిన 834 ఫ్రీ రిజిస్ట్రేషన్ కేసులకు సంబంధించిన రికార్డులు సంబంధిత కోర్టులకు పంపించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్డివిజన్ల పరిధిలలో నెల రోజుల్లో 19 కేసుల్లో వారి ప్రాపర్టీలను ఫిర్యాదుదారులకు సంబంధిత కోర్టుల ద్వారా ఇప్పించామని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం బాధితుల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు గతనెలలో 1,525 రాగా, ఇందులో 1,414 ఫిర్యాదులు పరిష్కరించి, 111 ఫిర్యాదులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.