కూడవెల్లి జాతరకు పోటెత్తిన భక్తులు
దుబ్బాక: కూడవల్లి రామలింగేశ్వర స్వామి జాతరకు మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున హాజరై పూజలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లిలోని కూడవల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.