10నెలల బాలికకు డెంగీ..


తాడ్వాయి: పది నెలల బాలికకు డెంగీ జ్వరం సోకింది. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వెలుగుచూసింది. వివరాలు.. తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామానికి చెందిన చందర్ రావు, సుజాత దంపతులకు 10 నెలల క్రితం ఓ కుమార్తె (రిక్విత) పుట్టింది. కాగా, పాపకు జ్వరం రావడంతో కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పాపను పరీక్షించిన వైద్యులు డెంగీ లక్షణాలున్నట్లు తేల్చారు. డెంగీ తీవ్రతను బట్టి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పాపను తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top