డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


ఖమ్మం : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని సులనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి బోనోవత్ ఇందు(18) ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇందు చిన్న తమ్ముడు అఖిల్ స్కూల్ నుంచి వచ్చి ఆ సంఘటన చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

(టేకులపల్లి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top