గోనెసంచిలో మృతదేహం


అర్వపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం నాగారం బంగ్లా గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో గోనె సంచిలో మూటకట్టిన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. నాగారం బంగ్లాకు చెందిన జాముల ముత్తయ్య(85) పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఎక్కడ గాలించినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం ఉదయం పాడుబడిన బావిలో నీటిపై ఒక గోనెసంచి తేలుతుండగా స్థానికులు గమనించారు.


పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మూటను బావి నుంచి వెలికి తీశారు. మూటలో ఉన్న మృతదేహాన్ని ముత్తయ్యదిగా గుర్తించారు. ఎవరో చంపి మూటకట్టి బావిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top