వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చి కూతురిపై చిత్రహింస

వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చి కూతురిపై చిత్రహింస


ఒకవైపు 'సెల్ఫీ విత్ డాటర్' అంటూ కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అందరూ పిలుపునిస్తుంటే.. రాజధాని నగరంలో మాత్రం ఓ కసాయి తండ్రి.. తన రెండో భార్యతో కలిసి కన్న కూతురిని చిత్రహింసలు పెట్టాడు. ఇంట్లో పనులు చేయట్లేదని ఆమె ముఖంపై యాసిడ్ పోసి.. సిగరెట్లతో కాల్చి అత్యంత దారుణంగా హింసించారు. ఈ ఘోరం హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ సమీపంలో జరిగింది.



బండ్లగూడ ఆనంద్ నగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి రమేష్‌కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి... చాముండేశ్వరిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇంట్లో పనిమనిషిగా చేసేశాడు. రెండో భార్య చాముండేశ్వరి కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయిని గదిలో బంధించి.. కర్కశంగా కర్రలు, వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చేది. అంత చేస్తున్నా.. ఆ కసాయి తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయేవాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా.. సర్ఫ్, సున్నం నీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కారని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది.



వేధింపులు భరించలేని ఆ అమ్మాయి చైల్డ్‌ లేబర్‌ కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమెకు విముక్తి కలిగించారు. తండ్రి రమేష్‌ పరారీలో ఉన్నాడు. అతని భార్య చాముండేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top