బాలికపై డ్యాన్స్మాస్టర్ అత్యాచారం
నిందితుడిపై కేసు నమోదు
సిద్దిపేటరూరల్: డ్యాన్స్ నేర్పిస్తాననే పేరుతో ఓ బాలికపై డ్యాన్స్మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని కాళ్లకుంట కాలనీకి చెందిన ఓ బాలిక (17) గతేడాది నుంచి పట్టణంలోని సుమన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది.
ఈ క్రమంలో ఆరు నెలల నుంచి ఆ బాలికపై డ్యాన్స్మాస్టర్ సుమన్ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇదిలా ఉంటే.. గురువారం బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆమెను వైద్యచికిత్సల కోసం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సలహాతో బాలికను సికింద్రాబాద్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో డ్యాన్స్మాస్టర్ సుమన్పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు.