దళితులకిచ్చిన హామీల అమలులో కేసీఆర్ వైఫల్యం
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ
హైదరాబాద్: దళితులకు ఇచ్చిన హామీల అమలులో సీఎం కేసీఆర్ వైఫల్యం చెందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించా రు. గురువారం హిమాయత్నగర్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశాల్లో సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏసురత్నం, సీపీఐ నేత గుండా మల్లేశ్, చాడా హాజరై ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వం దళితులపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడుగా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సాయిలు, ఉపాధ్యక్షులుగా ఏసురత్నం, మల్లేష్, సహాయ కార్యదర్శులుగా దేవదాస్, మహేందర్, యాదయ్య ఎన్నికయ్యారు.
సంబంధిత వార్తలు