ఆదివారం నుంచి సీపీఎం మహాసభలు


సాక్షి, హైదరాబాద్: సీపీఎం తెలంగాణ తొలిమహాసభల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆదివారం ఉదయం 10.30కి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రారంభిస్తారు. అంతకు ముందు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. నిజాం కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ‘తెలంగాణ జనజాతర ’ కార్యక్రమాన్ని ఆర్థికమంత్రి ఈటెల ప్రారంభిస్తారు. సాయంత్రం  కల్చరల్ ఎగ్జిబిషన్‌ను దర్శకులు దాసరి నారాయణరావు ప్రారంభించనున్నారు.


మార్చి1-4 తేదీల మధ్య ప్రతినిధుల సభ, ఆయా అంశాలపై తీర్మానాలు, నివేదికలపై చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రసేన కవాతు ఎస్‌వీకే నుంచి నిజాం కాలేజీ వరకు, మరొక ప్రదర్శన, ఇందిరాపార్కు నుంచి నిజాం కాలేజీ వరకు తెలంగాణ కళారూపాల ప్రదర్శన, ఇంకొకప్రదర్శన చార్మినార్ నుంచి నిజాం కాలేజీ వరకు ఉంటాయి. సాయంత్రం బహిరంగసభ ఉంటుంది.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top