ఆదివారం నుంచి సీపీఎం మహాసభలు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం తెలంగాణ తొలిమహాసభల షెడ్యూల్ను ప్రకటించారు. ఆదివారం ఉదయం 10.30కి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రారంభిస్తారు. అంతకు ముందు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. నిజాం కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ‘తెలంగాణ జనజాతర ’ కార్యక్రమాన్ని ఆర్థికమంత్రి ఈటెల ప్రారంభిస్తారు. సాయంత్రం కల్చరల్ ఎగ్జిబిషన్ను దర్శకులు దాసరి నారాయణరావు ప్రారంభించనున్నారు.
మార్చి1-4 తేదీల మధ్య ప్రతినిధుల సభ, ఆయా అంశాలపై తీర్మానాలు, నివేదికలపై చర్చ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రసేన కవాతు ఎస్వీకే నుంచి నిజాం కాలేజీ వరకు, మరొక ప్రదర్శన, ఇందిరాపార్కు నుంచి నిజాం కాలేజీ వరకు తెలంగాణ కళారూపాల ప్రదర్శన, ఇంకొకప్రదర్శన చార్మినార్ నుంచి నిజాం కాలేజీ వరకు ఉంటాయి. సాయంత్రం బహిరంగసభ ఉంటుంది.