సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే..

సీఎంకు అర్థమైంది కానీ ఆ పార్టీ నేతకే.. - Sakshi


హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన సీపీఎం ముఖ్యనేతలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నిజమైన కమ్యూనిస్ట్ తెలంగాణ సీఎం కేసీఆరే అని, బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అన్నారు.



తెలంగాణ అభివృద్ధి సీపీఎం నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అర్థమైంది కానీ ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రంకు అర్థంకాలేదని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కేరళ ముఖ్యమంత్రి విజయన్‌.. కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.



కేంద్ర మంత్రి సుష్మాకు లేఖ: సౌదీ అరేబియాలోని జైళ్లలో ఉన్న 29 మంది తెలంగాణ వారిని విడిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కేటీఆర్ కోరారు. ఆయన ఈ మేరకు లేఖ రాశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top