పోడు భూములకు పట్టాలివ్వాలి: సీపీఎం

పోడు భూములకు పట్టాలివ్వాలి: సీపీఎం - Sakshi


కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి నుంచి కలెక్టరేట్‌ వరకు సీపీఎం ఆధ్వర్యంలో నేడు మహా ప్రదర్శన జరిగింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు.



కలెక్టరేట్ ముట్టడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జితిన్ చౌదరి, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పోతినేని సుదర్శన్, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, అన్నవరపు కనకయ్య హాజరయ్యారు. ప్రజా పోరు సభ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్‌కు సీపీఎం నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. పోడు భూములకు పట్టాలు త్వరగా అందజేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ జరగాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top