కారులో ఆవు అపహరణకు యత్నం
సెక్యూరిటీ సిబ్బంది వెంబడించడంతో కారువదిలి పరార్
యైటింక్లయిన్కాలనీ : హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను ఎత్తుకెళ్లి వధశాలకు అమ్ముకునే ముఠా బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతం లో జీడీకే-11 గని చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇండికా కారులో ఆవును బంధిం చుకుని వెళ్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్జీ-1 ఏరియా సె క్యూరిటీ సిబ్బంది గమనించి కా రును వెంబడించారు. తప్పించుకునే క్ర మంలో యైటింక్లయిన్కాలనీవైపు వచ్చారు.
కాలనీ నుంచి స్పీడ్గా తిరిగి వెళ్తుండగా జీఎం ఆఫీస్ పాంచ్రాస్తా వద్ద ముం దు టైర్ల టైరాడ్ విరిగిపోయింది. దీంతో ఆవును కారులోనే ఉంచి అందులో ఉన్న ఐదుగురు పరారయ్యారు. ఆవు తెల్లవారు వరకు కారులోనే నరకయాతనకు అనుభవించింది. విషయం తెలుసుకున్న టూటౌ న్ పోలీసులు కారును పోలీస్స్టేషన్కు తరలించి అందులోని గోవును బయటకు తీశారు. సీఐ భద్రయ్య సంఘటన స్థలంలో నిందితుల గురించి ఆరాతీశారు. అనంతరం కమాన్పూర్ మండలం పెద్దంపేట్కు చెందిన ఆవు యజమాని లింగయ్యకు ఆవును అప్పగించారు.