ఆర్థిక బాధలతో దంపతుల ఆత్మహత్య
రంగారెడ్డి(వికారాబాద్): రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎడ్లబజార్లో ఇద్దరు దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.