రైతు రుణమాఫీలో బయటపడ్డ అక్రమాలు


రంగారెడ్డి: జిల్లాలో రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి అధికారులు భారీ అక్రమాలకు పాల్పడిన ఘటన దండుమైలారంలోని సహకార సంఘం కో ఆపరేటివ్ బ్యాంకులో వెలుగుచూసింది. దీంతో రైతులు ఆందోళన చేపట్టడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 


 


విచారణలో భాగంగా రైతు రుణమాఫీలో అవకతవకలు జరిగినమాట నిజమేనని సహకార సంఘం కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ అంగీకరించారు. ఈ ఘటనపై సబ్ డివిజన్ కో ఆపరేటివ్ అధికారి నర్సింహారెడ్డి నేతృత్వంలోని అధికారులు విచారణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top