నగరంలో కార్డన్ సెర్చ్


హైదరాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మీర్ పేట, లెనిన్ నగర్లలో నిర్వహించారు. ఎల్బీ నగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు.



ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించని 24 బైక్ లు, 4 ఆటోలు, 2 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 100 గ్రాముల గంజాయి, 62 క్వార్టర్ల మద్యం పట్టుబడింది. తొమ్మిదిమంది అనుమానితులను, ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top