బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య

బీసీలపై కాంగ్రెస్ వివక్ష: ఆర్.కృష్ణయ్య - Sakshi


సాక్షి, హైదరాబాద్: బీసీలపై కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఆ శాఖ తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీ ఓట్లకోసం పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని కట్టబెట్టాలనుకోవడం దారుణమని విమర్శించారు.


తెలంగాణ ఇచ్చినా ఆ పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడానికి గతంలో అగ్ర కుల ముఖ్యమంత్రుల పాలనే కారణమని దుయ్యబట్టారు. బీసీ వర్గానికి చెందిన పొన్నాలను మార్చి ఇప్పుడు అగ్రకులాలకు ఆ పదవిని ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే ఆ పార్టీ బీసీలకు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top