రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం

రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలం - Sakshi


హైదరాబాద్: రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలోని రైతాంగ సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్కు జీవన్రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు దృష్టి పెట్టాలని కేసీఆర్కు ఆ లేఖలో హితవు పలికారు.


ధాన్యం క్వింటాలుకు రూ. 100 చొప్పున చెల్లించాలని... అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ అంశంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందులోభాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top