అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి

అందుకే తీవ్రంగా స్పందించా : కోమటిరెడ్డి - Sakshi


నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీకి కావాల్సింది సర్వేలు కాదని...ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు.


('కోమటిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్తాడనుకోను' )


నకిరేకల్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఉత్తమ్‌ సర్వే చెప్పడం వల్లే తీవ్రంగా స్పందించానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే మొదటి సీటే నకిరేకల్ అని స్పష్టం చేశారు. తన వెనుక ఎవరు లేరని, తనపై విమర్శలు హాస్యాస్పదమని కొట్టిపడేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటున్న వారికి అనుభవం లేదని కోమటిరెడ్డి అన్నారు.


( నేను సీఎం అయ్యేది ఖాయం! )




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top