సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు
లక్ష్మణచాంద: సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు గర్జన సభకు మండల కాంగ్రెస్ నాయకులు తరలినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోశెట్టి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న సంగారెడ్డి జిల్లాలో రైతుల సమస్యలపై తలపెట్టిన రైతు గర్జన సభకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మండల కాంగ్రెస్ పార్టీకి మండల పార్టీ అధ్యక్షుడు పోశెట్టి, ప్రధాన కార్యదర్శి వేణుగౌడ్, నాయకులు ముత్యంరెడ్డి, రాంరెడ్డి ,చిన్న పోతన్న, శ్రీధర్రెడ్డి, గంగారెడ్డి, పెద్ద సాయన్న, నడిపి సాయన్న, మోహన్, భోజారెడ్డి, చిన్నయ్య, తదితరులు వెళ్లారు.