జాతిపితకు కాంగ్రెస్ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం గాడ్సేకు గుడి కట్టాలనే వ్యూహాల్లో ఉందని మండలి ఉపనేత పొంగులేటి సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో అంజన్కుమార్ యాదవ్, ఎం.కోదండరెడ్డి, జి.నిరంజన్, చరణ్, బాలాజీ, నరేందర్యాదవ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. కాగా, గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ లోక్సత్తా అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు పార్టీ కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు కటారి శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాస్రెడ్డి, ఎస్.వి. గజానని, కె.సోల్కర్రెడ్డి, బి.దుర్గారావు, కె.నాగమణి తదితరులు పాల్గొన్నారు.