'కేసీఆర్ మేనల్లుడు, కొడుక్కి పోటీ'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభతో చంద్రబాబును తిట్టడం తప్పా ప్రజలను ఒరిగిందేమీ లేదని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. గతంలోనూ చంద్రబాబును, టీడీపీని తిట్టే ఎన్నికల్లో గెలిచారని అన్నారు. భవిష్యత్ లో టీఆర్ఎస్ ను టీడీపీ చిత్తుగా ఓడిస్తుందనే తమ పార్టీ అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు.
నిన్న జరిగింది తెలంగాణ ద్రోహుల సభ అని... అందులో కేసీఆర్ మేనల్లుడు, కొడుక్కి పోటీ జరిగిందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కుక్కల్లా కాపలా ఉండి, నక్కల మోసం నుంచి తెలంగాణ కాపాడుకుంటామని అన్నారు. వాటర్ గ్రిడ్ పేరుతో రూ. 40 వేల కోట్లు మీ కొడుక్కి అప్పాజెప్పావంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.