‘కామన్‌వెల్త్’కు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు


సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న ఢిల్లీలో జరిగే కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఢిల్లీ చాప్టర్ నిర్వహిస్తున్న సదస్సుకు తెలంగాణ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ‘భారతదేశ ప్రజాస్వామ్యం- మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగే ఈ సెమినార్‌లో గొంగిడి సునీత(టీఆర్‌ఎస్), ఎన్.పద్మావతి(కాంగ్రెస్) పాల్గొననున్నట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top