ఫాంహౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్


 జగదేవ్‌పూర్: ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటన ముగించుకున్న సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఫాంహౌస్‌కు చేరుకున్నారు. భద్రాచలంలో శనివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి వరంగల్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.


పర్యటన పూర్తి కావడంతో ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ద్వారా నేరుగా మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలోని హెలీపాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం రాత్రికి ఇక్కడే ఉండి సోమవారం హైదరాబాద్ వెళ్లనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top